జనగామ మున్సిపాలిటీలో ముసలం

జనగామ మున్సిపాలిటీలో ముసలం ముదురుతోంది.మున్సిపాలిటీలో అధికార పార్టీ బీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కాయి.

 Clashes In Janagama Municipality-TeluguStop.com

ఛైర్మన్ పీఠం తమదంటే తమదేనని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోరుకు సిద్ధమైయ్యారు.

గత కొంతకాలంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ పి.జమునపై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఛైర్ పర్సన్ పీఠంపై బండ పద్మయాదగిరి రెడ్డి దృష్టి సారించారని సమాచారం.క్యాంపు రాజకీయాలకు తెర తీసిన బండ పద్మయాదగిరి రెడ్డి తమ వర్గానికే మద్ధతు తెలుపుతామని భువనగిరి ఎల్లమ్మ దేవాలయం సాక్షిగా కౌన్సిలర్లతో ప్రమాణం చేయించారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే చైర్ పర్సన్ వ్యతిరేక వర్గానికి బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం మద్ధతు తెలుపుతున్నారని వాదనలు సైతం వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా తెరవెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరనే విషయంపై జిల్లాలో చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube