ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక ఎన్నికలు అనగానే పోటీ చేస్తున్న కార్యకర్తల మధ్య వారి అనుచరుల మధ్య గొడవలు జరగడం మామూలే.
ప్రస్తుతం ఏపీ జిల్లాలోని పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న కొమరాడ మండలం విక్రమపురంలో అధికార పార్టీ నేతలకు టీడీపీ నేతలు అడ్డు చెప్పడంతో ఘర్షణ చోటుచేసుకుందట.ఆ వివరాలు చూస్తే.
పార్వతీపురం డివిజన్లో గల 15 మండలాల పరిధిలో ఈరోజు ఉదయం నుండి పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.ఈ నేపధ్యంలో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వచ్చిన వృద్ధురాలు వెంట ఉన్న వారిని వైసీపీ నేతలు అడ్డుకున్నారట.
దీంతో అక్కడ టీడీపీ, వైసీపీ నేతల మధ్య స్వల్ప వివాదం జరిగిందట.
ఈ క్రమంలో మిగిలిన ఏజెంట్లు, కార్యకర్తలు పోలింగ్ బూత్లోకి రావడంతో ఆ వాతవరణం కాస్త ఉద్రిక్తంగా మారిందట.
కాగా పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో వాతావరణం కాస్త చల్లబడిందట.