మద్యం మత్తులో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. ఘర్షణకు కారణం ఇదేనటా.. ?

మనిషి చనిపోతే ఆ బాధలో ఉంటారు అక్కడ వున్న వారు.ఇలా ఉన్న పరిస్దితుల్లో ఎవరు కూడా గొడవలు చేయడానికి సాహసించరు.

 Srikakulam, Clash, Ycp, Tdp, Funeral,clash Between Ycp And Tdp Leaders At Funera-TeluguStop.com

కానీ ఓ రెండు పార్టీల వర్గాల వారు మాత్రం ఇవేమి ఆలోచించకుండా గొడవకు దిగారట.

శ్రీకాకుళం జిల్లా కంచిలి (మం) అర్జునాపురంలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే.

గతరాత్రి అర్జునాపురం గ్రామంలో మరణించిన ఒక వ్యక్తి దహన సంస్కారాల్లో పాల్గొన్న వైసీపీ, టీడీపీ వర్గీయులు పీకలదాకా మద్యం తాగారట.ఆ తర్వాత కల్లుతాగిన కోతి చిందులేసినట్లు ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో అదికాస్త ఘర్షణకు దారితీసిందట.

దీంతో ఒకరి పై ఒకరు కర్రలు, కత్తులతో దాడి చేసుకోగా, ఈ దాడిలో

టీడీపీ

కి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారట.ఇలా గాయపడిన వారిని సోంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారట.

ఇకపోతే దహనసంస్కారాల్లో తలెత్తిన వివాదం వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసిందనే విషయం తెలిసిన వారు ఈ ఘటనకు బాధ్యులైన వారికి బుద్ధి,జ్ఞానం లేదని దుమ్మెత్తిపోస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube