రాధేశ్యామ్ థియేటర్స్ లోనే.. ఓటిటిలో కాదు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాల్లో కొన్ని రిలీజ్ కు రెడీ అవ్వగా.

 Clarity On Radhe Shyam Theatrical Release, Radhe Shyam Movie, Rumor, Radhe Shyam-TeluguStop.com

మరికొన్ని సినిమాలు మాత్రం సెట్స్ మీద ఉన్నాయి.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.

కరోనా ఫస్ట్ వేవ్ నుండి ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది.ఇక ఇన్నాళ్లకు రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ అంత ఎదురు చుస్తే మరోసారి కూడా థర్డ్ వేవ్ కారణంగా నిరాశ తప్పలేదు.

ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు వీర లెవల్ లో ఉన్నాయి.ఇంకా నార్త్ లో అయితే ప్రభాస్ సినిమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అని కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని బజ్ క్రియేట్ చేసాయి.ఈ సినిమా వాయిదా పడడంతో మరోసారి ఈ సినిమాపై ఆసక్తికర టాక్ వైరల్ అవుతుంది.రాధేశ్యామ్ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేస్తారు అనే వార్త మరోసారి వైరల్ అవుతుంది.ఈ వార్తలు చెక్ పెడుతూ థమన్ సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్నీ తెలిపాడు.

థమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ మేకింగ్, గ్రాండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ లా ఉంటుందని.నేను కూడా మీ అందరితో కలిసి థియేటర్స్ లోనే ఈ సినిమాను చూస్తానని.సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేసేసాడు.సో ఇప్పుడు వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.మరి ఈ సినిమా మరో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube