పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాల్లో కొన్ని రిలీజ్ కు రెడీ అవ్వగా.
మరికొన్ని సినిమాలు మాత్రం సెట్స్ మీద ఉన్నాయి.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.
కరోనా ఫస్ట్ వేవ్ నుండి ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది.ఇక ఇన్నాళ్లకు రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ అంత ఎదురు చుస్తే మరోసారి కూడా థర్డ్ వేవ్ కారణంగా నిరాశ తప్పలేదు.
ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు వీర లెవల్ లో ఉన్నాయి.ఇంకా నార్త్ లో అయితే ప్రభాస్ సినిమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అని కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని బజ్ క్రియేట్ చేసాయి.ఈ సినిమా వాయిదా పడడంతో మరోసారి ఈ సినిమాపై ఆసక్తికర టాక్ వైరల్ అవుతుంది.రాధేశ్యామ్ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేస్తారు అనే వార్త మరోసారి వైరల్ అవుతుంది.ఈ వార్తలు చెక్ పెడుతూ థమన్ సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్నీ తెలిపాడు.
థమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ మేకింగ్, గ్రాండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ లా ఉంటుందని.నేను కూడా మీ అందరితో కలిసి థియేటర్స్ లోనే ఈ సినిమాను చూస్తానని.సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేసేసాడు.సో ఇప్పుడు వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.మరి ఈ సినిమా మరో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా వేచి చూడాల్సిందే.