కరోనా నియంత్రణలో భాగంగా భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తున్న విష్యం తెలిసిందే.కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాని సమర్ధవంతంగా ఎదుకునే యాంటీబాడీలను సిద్ధం చేస్తుంది.
ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.కొవాగ్జిన్ తో పాటుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది.
అయితే కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ కు భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.హైదరాబాద్ శామీర్ పేట జినోం వ్యాలీలో ఉన్న కంపెనీకి 64 మందితో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఇఎస్ ఎఫ్) కమెండోలతో రక్షణ కల్పిస్తూ కేంద్రం ఆదెశాలు జారీ చేసింది.
ఈ నెల 14 నుండి కమెండోలు భారత్ బయోటెక్ కు రక్షణగా పహరా కస్తారని తెలుస్తుంది.ఇదే విషయాన్ని సీఇ ఎస్ ఎఫ్ డిప్యూటె ఇన్ స్పెక్టర్ జనరల్ అనీల్ పాండే వెల్లడించారు.
వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలపై ఉగ్రవాదుల కన్ను పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం స్పెషల్ సెక్యురిటీ ఏర్పాటు చేసింది.2008లో ముంబై ఉగ్రవాదాడుల తర్వాత ప్రభుత్వం ప్రముఖ ప్రైవేట్ సంస్థలకు ఇలాంటి భద్రత ఏర్పాటు చేస్తూ వస్తుంది.పూణె, మైసూర్ లోని ఇన్ ఫోసిస్, నవీ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్, హరిద్వార్ లోని బాబా రాం దేవ్ పతంజలి తో పాటుగా దేశంలో 10 చోట్ల ఇలాంటి భద్రత కల్పిస్తుంది.భారత్ బయోటెక్ కు సీఐఎస్ ఎఫ్ కమెండోల్తో భద్రత కల్పించి వ్యాక్సిన్ తయారీ సంస్థకు రక్షణ కల్పిస్తుంది.