బాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన “సూర్య వంశీ” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సుమారు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఈ క్రమంలోనే డైరెక్టర్ రోహిత్ శెట్టి మరొక సినిమాను కూడా ప్రకటించారు.
ఈ క్రమంలోనే దర్శకుడు ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్‘ రీమేక్గా వస్తున్నటువంటి చిత్రానికి “సర్కస్” అనే టైటిల్ ఖరారు కాగా ఇందులో రణ్వీర్ సింగ్, వరుణ్ శర్మ, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రణవీర్ సింగ్ నటించగా అతని భార్య దీపికా పదుకొనే అతిథి పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే 2013వ సంవత్సరంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో మీనమ్మ పాత్ర ద్వారా దీపికాపదుకునే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమా దీపికా కెరీర్లో ఒక మైలురాయని చెప్పవచ్చు.
చెన్నై ఎక్స్ప్రెస్ ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దీపికాను ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో తీసుకువస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసారు దర్శకుడు రోహిత్ శెట్టి.ఇక రణవీర్ సింగ్, దీపిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరినీ ఇలా జంటగా కలిసి చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారని ఈ క్రమంలోనే దర్శకుడు ఈ విధమైనటువంటి ప్లాన్ చేసారని తెలుస్తోంది.