ప్రస్తుతం దేశంలో మరణాల సంఖ్య విపరీతంగా చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించే ఉంటారు.రోజు ఏదో ఒక రూపంలో మృత్యువు ప్రజల ప్రాణాలను తీసుకుంటుంది.
దీనికి తోడు కరోనా సహకరిస్తుండటంతో మరణం కూడా చాలా బిజీగా మారిపోయింది.
ఈ క్రమంలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలను చావు పలకరిస్తుండగా వీరి మారణాలు కూడా ఎక్కువ అయ్యాయి.
కాగా తాజాగా మరో పొలిటికల్ లీడర్ గుండెపోటుతో మరణించిన ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు (66) గత అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.
కాగా ఈయన సీపీఐ అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాకుండా, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గానూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగాను పనిచేశారు.
ఇకపోతే అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.