ఇప్పుడు ఏపీ లో ఏ పొలిటికల్ అప్డేట్ అయినా ఇప్పుడు హాట్ హాట్ గానే కనిపిస్తోంది.పోలింగ్ తేదీ ముగిసిన దగ్గర నుంచి ఏదో ఒక పొలిటికల్ ఇష్యుతో రాజకీయ రచ్చ జరుగుతోంది.
ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ? అంటూ అధికార టీడీపీ ప్రశ్నిస్తూ ఐ వాంట్ డెమోక్రసీ అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తోంది.ఇప్పుడు ఈ పొలిటికల్ ఇష్యూలోకి వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చేసాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.తన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వచ్చే నెల 1న ఏపీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన వర్మ ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు నిర్మాతలను వెంటేసుకుని నేటి ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు.
ఇక్కడే అసలు కదా మొదలయ్యింది.అలా ల్యాండ్ అయిన వర్మను నగరంలోకి ఎంట్రీ ఇవ్వకుండా హైదరాబాద్ కి పంపించేశారు.
మళ్ళీ ఇక్కడ కూడా ఐ వాంట్ డెమోక్రసీ అనే పదమే గట్టిగా వినిపించింది.
నిజం చెప్పేందుకు ప్రయత్నించడమే తాను చేసిన తప్పా అంటూ వర్మ ట్విట్టర్ వేదికగా వర్మ ఆవేదనని వ్యక్తం చేసాడు.
అంతే కాదు హే బాబూ ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.ఇక ఇప్పుడు వర్మకు అండగా వైసీపీ అధినేత జగన్ గొంతు కలిపారు.
ట్విట్టర్ వేదికగా ఆయన బాబు ని ప్రశ్నించారు.విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందన్నారు.
పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందన్నారు.చంద్రబాబు గారూ ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి ? అంటూ ట్విట్టర్ వేదికగా జగన్ ప్రశ్నించారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఇటీవల తెలంగాణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో వర్మ ప్రెస్ మీట్ ను పోలీసులు అడ్డుకోవడం వర్మ సినిమాకు మరింత ప్రచారం, అలాగే టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ కి కారణం అయ్యింది.
ఇక ముందు ముందు ఈ ఇష్యు మరింత ముదిరే ఛాన్స్ కనిపిస్తోంది.