ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యథేచ్ఛగా ప్రజలను భయభ్రాంతులను చేసే రీతిలో పోస్టులు పెడుతూ కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సమస్య ఇప్పుడే కాదు ఎప్పటి నుండో ఉంది.
అయితే ఇది మరింత పెచ్చుమీరి పోయి ప్రభుత్వ వ్యవస్థలపై అదే రీతిలో న్యాయమూర్తులపై తప్పుడు పోస్టులు ఇటీవల పెడుతూ సమాజంలో రెచ్చగొట్టే రీతిలో మారిపోయింది.
దీంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పే పరిస్థితి కనబడుతూ ఉండటంతో తాజాగా ఇటీవల న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తూ పెడుతున్న పోస్టులను టార్గెట్ చేసుకుని ఎవరైతే ఈ రీతిలో వ్యవహరిస్తున్నారు వారిపై సిఐడి దర్యాప్తు చేయడానికి రెడీ అయింది.
గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడి బృందం అసత్య ప్రచారం చేసే వారిని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధమైంది.సమాజంలో గొడవలు సృష్టించడానికి కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెట్టే రీతిలో కొంతమంది వ్యవహరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సీఐడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
.