'కమ్మ' ఓట్ల కోసం మహేష్ చుట్టానికి జగన్ గాలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలలో పెను మార్పులు తీసుకోనిరావడం కోసం చాలా వేగంగా స్పందిస్తున్నారు.జగన్ మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయలవైపూ, సామాజిక వర్గం వైపూ కన్ను వేసినట్టు కనిపిస్తోంది.

 Chowdary Vote Bank For Ysrcp-TeluguStop.com

పార్టీకి పెద్దగా సపోర్ట్ ఇవ్వని ‘ కమ్మ ‘ ఓటు బ్యాంకు మీద ఆయన దృష్టి పెట్టారు అని చెప్పచ్చు.

మహేశ్ తండ్రి – సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావుకు వైసీపీ అత్యున్నత నిర్ణయాక విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ)లో సభ్యత్వం కల్పించారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఆదిశేషగిరిరావుకు పీఏసీలో చోటు కల్పించడంతో ఆ జిల్లాలో పార్టీని విస్తరించేందుకు మార్గం సుగమం చేసే ఎత్తుగడలో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేకర్ రెడ్డికి శేషగిరిరావు అత్యంత సన్నిహితుడు అయితే ఆయన మొదటి నుంచీ కాంగ్రెస్ లోనే ఉంటూ ఒచ్చారు.ఏఐసీసీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గా కూడా ఆయన అప్పట్లో పనిచేసారు.2014 లో వైకాపా లో చేరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube