ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయిపల్లవి ఆ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.స్టార్ హీరోలకు జోడీగా సాయిపల్లవికి మూవీ ఆఫర్లు రాకపోయినా కోట్ల సంఖ్యలో సాయిపల్లవి అభిమానులను సంపాదించుకుంది.
ఫిదా మూవీలో సాయిపల్లవి డ్యాన్స్ చేసిన వచ్చిండే పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మారి 2 సినిమాలోని రౌడీ బేబీ పాట కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంది.
లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి సారంగదరియా పాటకు డ్యాన్స్ చేయగా ఆ పాట ఆదివారం విడుదలై 24 గంటల్లో 7 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఈ పాట ఈరోజుతో సారంగదరియా పాట కోటి మార్కును అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సాయిపల్లవి డ్యాన్స్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా శేఖర్ మాస్టర్ ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో నెమలి నాట్యం ఆడితే ఏ విధంగా ఉంటుందో సాయిపల్లవి డ్యాన్స్ చేస్తే అదే విధంగా ఉంటుందని అన్నారు.
ఇప్పటివరకు సాయిపల్లవితో ఫిదా సినిమాలోని వచ్చిండే, ఎంసీఏ మూవీలో ఏవండోయ్ నానిగారు పాటలు కొరియోగ్రాఫ్ చేశానని సారంగ దరియా మూడో పాట అని శేఖర్ మాస్టర్ చెప్పారు.గతంలో సాయిపల్లవితో చేసిన పాటలు హిట్ కావడంతో ఈ పాట విషయంలో అంచనాలు భారీగా పెరిగాయని శేఖర్ మాస్టర్ అన్నారు.డ్యాన్స్ మూవ్ మెంట్లను సాయిపల్లవి ఎంతో బాగా చేస్తుందని.తనకంటే ఎవరూ బెటర్ గా చేయలేరని అనిపించేలా చేస్తుందని అన్నారు.
క్లాసికల్ డ్యాన్సర్ అయిన సాయిపల్లవి నెమలి నాట్యం చేసినట్లు డ్యాన్స్ చేస్తుందని.హీరోలు సైతం చేయడానికి కష్టంగా భావించే స్టెప్స్ ను సాయిపల్లవి తేలికగా చేస్తుందని శేఖర్ మాస్టర్ అన్నారు.
డ్యాన్స్ విషయంలో సాయిపల్లవికి మరో హీరోయిన్ పోటీ ఇవ్వలేదని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.