టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు.ఈయన కెరీర్ మొదటి నుండి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ డీసెంట్ హిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
టాలీవుడ్ లో శర్వానంద్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.
అయితే కొద్దీ రోజులుగా ఈయన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.సరైన హిట్ లేక రేస్ లో వెనుక పడ్డాడు.
ప్రెసెంట్ శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘మహాసముద్రం’ లో నటిస్తున్నాడు.ఈ సినిమా కూడా హిట్ అవ్వకపోతే శర్వానంద్ కెరీర్ లో చాలా వెనుక బడి పోతాడు.
అందుకే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా నుండి విడుదల అయినా టీజర్, పోస్టర్స్, పాటలు అన్ని ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు సిద్దార్థ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు భారీ యాక్షన్ సన్నివేశాలతో హై వోల్టేజ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు శర్వా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు‘ సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ ఏడాదిలోనే ఈ సినిమా కూడా పూర్తి అవ్వబోతున్న నేపథ్యంలో శర్వా మరొక సినిమాను లైన్లో పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇప్పటికే చాలా మంది దర్శక నిర్మాతలతో శర్వా సంప్రదింపులు జరుపుతున్నాడు.అయితే ఒక దర్శకుడికి శర్వా ఓకే చెప్పినట్టు సమాచారం.ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే.కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు శర్వా ఓకే చెప్పాడట.
మరి త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.వీరిద్దరూ ఎప్పటి నుండో ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నారట.ఇప్పటికి వీరిద్దరి కాంబోలో సినిమా కుదిరిందట.
ఇక ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారట.దసరాకు ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.