ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.దీంతో వెంటనే కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది.
ఊపిరితిత్తులు బాగా ఇన్ఫెక్షన్ కావడంతో అత్యవసర చికిత్స.వైద్యులు చేయగా మరణంతో పోరాడిన శివ శంకర్ మాస్టర్ ఈరోజు సాయంత్రం మరణించడం జరిగింది.
తమిళ మరియు తెలుగు భాషలతో పాటు.ఎనిమిది భాషలలో దాదాపు ఎనిమిది వందల చిత్రాలకు పైగా.
కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది.
కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాక సినిమాల్లో కూడా నటించారు.
దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించిన ఆయన టెలివిజన్ రంగంలో పలు ప్రముఖ షోలలో జడ్జిగా రాణించడం జరిగింది.ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా.పేరు సంపాదించిన శివ శంకర్ మాస్టర్ మరణించటంతో ఇండస్ట్రీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు శివ శంకర్ మాస్టర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.దాదాపు 72 సంవత్సరాలు జీవించిన ఆయన 1948 డిసెంబర్ 7వ తారీకు చెన్నై లో పుట్టారు.
మగధీర సినిమా కి జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు.శివ శంకర్ మాస్టర్ మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొద్దిరోజుల క్రితమే శివ శంకర్ మాస్టర్ చికిత్స నిమిత్తం చిరంజీవి, సోనూసూద్ వంటి ప్రముఖులు.కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు.
అయినా కానీ ఆయన మరణించడంతో సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.