కమల్ హసన్ తర్వాత సౌత్ ఇండియాలో విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి చియాన్ విక్రమ్.తెలుగు సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత తమిళంలో సక్సెస్ అయిన విక్రమ్ కెరియర్ లో చాలా ఆటుపోట్లు ఉన్నాయి.
అన్నింటిని అధికమించి తనని తాను స్టార్ గా ఆవిష్కరించుకున్నాడు.ఈ మధ్య కాలంలో అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్న కూడా అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం మహావీర్ కర్ణ, పొన్నియన్ సెల్వన్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా విక్రమ్ లైన్ లో పెట్టి ఉంచాడు.ఇక ఈ ఏడాది తన కొడుకు ధృవ్ ని అర్జున్ రెడ్డి రీమేక్ తో హీరోగా పరిచయం చేశాడు.
ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయనకు మరో ప్రమోషన్ రాబోతోంది.
త్వరలోనే విక్రమ్ తాత కాబోతున్నాడు.తమ ఇంట్లో అడుగుపెట్టబోతున్న కొత్త తరం కోసం ఇంటిల్లిపాది ఎదురు చూస్తున్నారు. విక్రమ్, శైలజ దంపతులకు ధ్రువ్ తో పాటు అక్షిత అనే కుమార్తె కూడా ఉంది.2017లో అక్షితకు రంజిత్ తో వివాహం జరిగింది.త్వరలోనే అక్షిత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.ఈ నేపథ్యంలో, తమకు అత్యంత సన్నిహితులైన కొద్ది మంది సమక్షంలో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు విక్రమ్ ప్లాన్ చేస్తున్నారట.
మొత్తానికి ఒకే ఏడాదిలో చియాన్ విక్రమ్ కి పుత్రోత్సాహం, అలాగే తాతగా ప్రమోషన్ తో రెండు సంతోషకరమైన విషయాలని ఆస్వాదిస్తున్నాడు.