మెగా ఫ్యామిలీ నుండి తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ ఇన్నేళ్ల కాలంలో మంచి కమర్షియల్ సక్సెస్లు ఒక్కటి రెండు మాత్రమే దక్కించుకున్నాడు.ఈయన కెరీర్కు బూస్ట్ ఇవ్వడంలో ఆ సినిమాలు కూడా విఫలం అయ్యాయి.
గత రెండేళ్ల కాలంలో అసలు తేజూకు సినిమా సక్సెస్లు రాలేదు.అయినా కూడా మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉన్న కారణంగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఈయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంకు చిత్రలహరి అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగింది.
షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.మొదటి నుండి కూడా ఈ చిత్రాన్ని 20 కోట్ల బడ్జెట్తో రూపొందించాలని భావించారు.అయితే మైత్రి వారికి వరుస పరాజయాలు, నష్టాలతో పాటు సాయి ధరమ్ తేజ్ గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మరీ ఎక్కువ బడ్జెట్ను తేజూ రికవరీ చేయడం కష్టం అంటూ మైత్రి వారు ముందస్తు జాగ్రత్త పడ్డట్లుగా తెలుస్తోంది.
దాదాపు ఆరు కోట్ల రూపాయలను కట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘చిత్రలహరి’ చిత్రంను 14 కోట్లతో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.ఈ స్థాయి బడ్జెట్తో సినిమాను నిర్మిస్తే సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ రైట్స్, ఈ రైట్స్ అంటే కనీసం 10 నుండి 12 కోట్ల వరకు వస్తుంది.అప్పుడు నష్టాలు ఎక్కువగా ఉండవు అనేది నిర్మాతల ప్లాన్గా తెలుస్తోంది.
అయితే మెగా హీరో మూవీ మరీ 14 కోట్ల బడ్జెట్ ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.