మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కిషోర్ తిరుమలల కాంబినేషన్లో రూపొందిన ‘చిత్రలహరి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఎన్నికలు పూర్తి అయిన తెల్లారి అంటే ఈనెల 12వ తారీకున చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ చిత్రంకు ముందు తేజ్ చేసిన ఆరు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.అయితే దర్శకుడు కిషోర్ తిరుమల కారణంగా ఈ చిత్రంకు మంచి బిజినెస్ దక్కింది.మైత్రి మూవీస్ వారు ఈ చిత్రంను దాదాపుగా 20 కోట్లతో రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది.20 కోట్ల బడ్జెట్ నిర్మాతలకు సినిమా విడుదలకు ముందే రికవరీ అయినట్లుగా తెలుస్తోంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ హక్కుల ద్వారా 13.5 కోట్ల రూపాయలను దక్కించుకుంది.ఇక శాటిలైట్ రైట్స్ మరియు ఆన్లైన్ ప్రైమ్ వీడియో రైట్స్ ద్వారా 7.5 కోట్లను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.విడుదలకు ముందే మైత్రి మూవీస్ వారు లాభాలను దక్కించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అన్ని వర్గాల వారు ఈ చిత్రంను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సాయి ధరమ్ తేజ్కు జోడీగా ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శి మరియు నివేదా పేతురాజ్లు హీరోయిన్స్గా నటించారు.సునీల్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి కమెడియన్గా నటించాడు.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.ఒక నిరుద్యోగి యువకుడు పడే కష్టాలు, అతడి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చిత్రంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
కిషోర్ తిరుమల యూత్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీస్తాడు.అలాగే ఈ సినిమా కూడా తీసి ఉంటాడు అంటూ టాక్ వినిపిస్తుంది.