దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప.ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది.
ఈ సినిమా మరొక కొన్ని గంటల్లోనే విడుదలకానుంది.ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన శ్రీవల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంతా మొదటిసారిగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమాలోని సాంగ్స్ మార్మోగి పోతున్నాయి.ఇకపోతే ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.
తాజాగా అల్లు అర్జున్, రష్మిక మందన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఇక పుష్ప సినిమా గురించి, పుష్ప సినిమాలో తాను పడ్డ కష్టాలు గురించి చెప్పుకొచ్చాడు.
పుష్ప సినిమా షూటింగ్ సమయంలో కేవలం తన మేకప్ కి రెండు గంటల సమయం పట్టిందని, మేకప్ ని తీసేయడానికి 20 నిమిషాల సమయం పట్టేది అని తెలిపారు.
అలాగే ఉదయం నాలుగు గంటలకే లేచి షూటింగ్ కి వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఫుల్లు టైర్డ్ అయిపోయేవాడిని అని తెలిపారు.ఇక షూటింగ్ స్పాట్ లో కూడా అల్లుఅర్జున్ ఉదయాన్నే లేచి జిమ్ చేస్తారంట కదా అని సుమ అడగగా.వారానికి ఐదు రోజులు చేస్తూ ఉంటాను.
కొన్ని సార్లు అటు ఇటు జరుగుతూ ఉంటుంది.కానీ రష్మిక మందన రోజు తప్పకుండా కంటిన్యూగా చేస్తూనే ఉంటుందని తెలిపారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప రెండు భాగాలు కాదు నాలుగు భాగాలతో సమానం అని తెలిపారు అల్లు అర్జున్.