టాలీవుడ్ సీనియర్ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు.ప్రస్తుతం కైకాల సత్యనారాయణ వయసు 87 ఏళ్ళు.
ఈయన కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామాలో 1935 జులై 25 న లో జన్మించారు.ఈయన తన సినీ జీవితంలో ఎన్నో మరపు రాని సినిమా లలో నటించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందు కున్నాడు.1959 లో ‘సిపాయి కూతురు‘ అనే సినిమా తో కైకాల సినీ రంగ ప్రవేశం జరిగింది.
ఆయన ఎస్ వి రంగారావు తర్వాత వైవిధ్య మైన పాత్రలు పోషించిన నటుడిగా టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు.
ఈయన తీవ్ర అస్వస్థతకు గురి అవ్వడంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఈయన ఆరోగ్యంపై నిన్న అపోలో హాస్పిటల్ వారు హెల్త్ బులెటిన్ విడుదల చేసి ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది అని వెల్లడించారు.
దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసారు.కైకాల ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ గురించి చిరు ఒక ట్వీట్ చేసాడు.ఐసీయూ లో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ గారు స్పృహ లోకి వచ్చారని తెలియగానే వైద్యం అందిస్తున్న డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో కైకాల గారితో మాట్లాడాను.
ట్రాకియాస్టోమి కారణంగా ఆయన ప్రస్తుతం మాట్లాడలేక పోయిన కూడా త్వరగా ఇంటికి రావాలని అందరం సెలెబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు థమ్స్ అప్ సింబల్ చూపించారని డాక్టర్ తెలిపినట్టు చిరు ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు.ఈ విషయాన్నీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చిరు తెలిపారు.కైకాల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న వారు ఈ వార్తతో కాస్త ఊరట చెందుతున్నారు.