టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటు వయసులో కూడా యంగ్ హీరోలకంటే మరింత వేగంగా దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన మెగాస్టార్.
మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరో గా నిలిచాడు.అంతేకాకుండా యంగ్ హీరోలతో సహా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు.
ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇందులో చిరంజీవి తో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.
ఇక ఇందులో వీరిద్దరూ నక్సలైట్లు గా కనిపించనున్నారు.ఇందులో చరణ్ సిద్ధ పాత్రలో కనిపిస్తారు.
ఇక ఈ సినిమాలో చరణ్.చిరంజీవికి కొడుకుగా కనిపించనున్నట్లు వార్తలు తెగ ప్రచారం కాగా.
ఇటీవలే డైరెక్టర్ కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో ఇవి కేవలం పుకార్లను తెలిపాడు.అంతే కాకుండా ఇందులో రామ్ చరణ్ సెకండ్ ఆఫ్ లో కూడా కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకున్న చిరంజీవి ఈ సినిమా తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాడు.
ఆచార్య సినిమా షూటింగ్ త్వరలోనే ముగించాలని అనుకోగా.
మరో రెండు వారాల్లో ఈ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తుంది.ఇక ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి సుదీర్ఘ విరామం తీసుకుంటానని తెలిపాడట.
ఈ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాల్లోకి అడుగుపెట్టనని నేరుగా చెప్పేసాడట.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉండటంతో.
ఈ వైరస్ సాధారణ స్థితికి వచ్చే వరకు చిరంజీవి మరో ప్రాజెక్టులోకి వెళ్లే అవకాశం లేదని.అంతవరకు వేచి చూస్తానని ఇదే ఒక పనిగా భావించికున్నాడట చిరంజీవి.
ఇక చిరంజీవి వేదాళం రీమేక్, లూసిఫర్ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా మరో ఇద్దరు దర్శకులు కూడా చిరంజీవి కోసం ఎదురుచూస్తున్నారట.