మెగాస్టార్ చిరంజీవి అయిదు నిమిషాల గెస్ట్ అప్పియరెన్స్కు అయిదు కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు అంటూ ఫిల్మ్ సర్కిల్స్తో పాటు మీడియా సర్కిల్స్లో కూడా జోరుగా ప్రచారం జరుగోతంది.రామ్చరణ్ హీరోగా నటిస్తున్న శ్రీనువైట్ల మూవీలో హీరో పాత్రలో చిరంజీవి నటించబోతున్నాడు అని, చిరంజీవి సినిమాకు రామ్చరణ్ ఫైట్ కంపోజ్ చేస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ సినిమాలో కేవలం అయిదు నిమిషాలు మాత్రమే చిరంజీవి కనిపించి, ఏకంగా అయిదు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోబోతున్నాడు అంటూ చెబుతున్నారు.చిరు ఉంటే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతో నిర్మాత ఇంత మొత్తం ఇచ్చేందుకు సిద్దం అయ్యాడట అని వార్తలు వస్తున్నాయి.
తాజాగా చరణ్ మూవీలో చిరు గెస్ట్ అప్పియరెన్స్పై ఆ సినిమా రచయిత కోన వెంకట్ స్పందిస్తూ వార్తలను కొట్టి పారేశాడు.ఈ సినిమాలో చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ లేదు అంటూ తేల్చి చెప్పాడు.
అయినా కూడా మీడియాలో చిరంజీవి నటించనున్నాడు అని, అందుకు పారితోషికంగా 5 కోట్లు తీసుకుంటున్నాడు అని కూడా ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఏ వార్తలను నమ్మాలో తెలియక మెగా ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు.
ఈ విషయంపై దర్శకుడు శ్రీనువైట్ల కాని, చరణ్ కాని, చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరైనా క్లారిటీ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.దసరాకు అక్టోబర్ 15న చరణ్ మూవీ రాబోతున్న విషయం తెల్సిందే.