మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే చిరు పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఆ సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ గా వస్తుంది.
ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది.
కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా షూటింగ్ లో పాల్గొంటుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ అర్దాంతరంగా వాయిదా పడినట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న నిరవ్ షా మరొక సినిమా కు కమిట్ అవ్వడం వల్ల ఈ సినిమా షూట్ నిలిచి పోయిందట.
నిరవ్ షా గాడ్ ఫాదర్ సినిమాతో పాటు కోలీవుడ్ లో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమా కోసం కూడా పని చేస్తునట్టు తెలుస్తుంది.
ఈ సినిమా కోసం అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట.ఈ రెండు సినిమాలు ఒకేసారి షూట్ జరుపుకోవడంతో గాడ్ ఫాదర్ షూట్ కు నిరవ్ షా హాజరుకాలేక పోతున్నారు.అందుకే ఈ సినిమాను నాలుగు రోజుల పాటు వాయిదా వేసారట.
నిరవ్ షా ముందుగా అజిత్ సినిమాను ఒప్పుకోవడంతో పైగా ఈ సినిమా షూట్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతుండడంతో గాడ్ ఫాదర్ మేకర్స్ కొద్దిగా వెనక్కి తగ్గి షూట్ వాయిదా వేసారట.నాలుగు రోజులు తర్వాత షూట్ పూర్తి అవుతుందట.అది అవ్వగానే ఇక నిరవ్ షా పూర్తిగా గాడ్ ఫాదర్ సినిమాతో బిజీ అవ్వబోతున్నాడని తెలుస్తుంది.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
ఇక చిరు ఈ సినిమాతో పాటు ఆచార్య, భోళా శంకర్, వాల్తేరు వీరన్న సినిమాలు కూడా చేస్తున్నాడు.