చిరంజీవి ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు సినిమా రంగంలో ఉన్నారు.ఇక పెద్ద కూతురు, చిన్న కూతురు కాస్ట్యూమ్ డిజైనర్స్ గా రాణిస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ సినిమాలకి వారు పని చేసిన అనుభవం ఉంది.మెగాస్టార్ అండ ఉండటం వలన మరింతగా వారు సినిమా రంగంలో ఇతర విభాగాలలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగా పెద్ద కూతురు సుస్మిత ఇప్పటికే వెబ్ సిరీస్ లు నిర్మించడం మీద దృష్టి పెట్టింది.దాని కోసం ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది.
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించే పనిలో ఉంది.
ఇటీవల ఆమె ఓ వెబ్ సిరీస్ కి శ్రీకారం చుట్టింది.
ఆనంద్ రంగ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నాడు.అప్పుడెప్పుడో వచ్చిన ఓయ్ సినిమాతో ఆనంద్ రంగా దర్శకుడుగా పరిచమయ్యాడు.
తరువాత సందీప్ కిషన్ తో డికే బోస్ అనే సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.తరువాత అతను పెద్దగా సినిమాలు చేయలేదు.
అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు.సుస్మిత ప్రొడక్షన్ లో దీన్ని పట్టాలెక్కించారు.
ఇదో థ్రిల్లర్ అని తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయని ఒక్కోక్క ఎపిసోడ్ నిడివి 30 నుంచి 40 నిమిషాల లోపు ఉంటుందని తెలుస్తోంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో బయటకు వస్తాయి.ఆహా ద్వారానే ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.