సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి.ఈ చిత్రం ఉయ్యాలవాడ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ చరణ్ నిర్మించాడు.
ఈ చిత్రం ఇటివల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సంధర్బంగా మెగా స్టార్ చిరంజీవి రాజకీయ,సినిమా ప్రముఖులను స్వయంగా వెళ్లి కలవడం తన సినిమా చుడాలిసిందిగా కోరడం జరుగుతుంది.
తాజాగా చిరంజీవి, తెలంగాణా గవర్నర్ తమిలిసై ని కలవడం జరిగింది.
తన సినిమా సైరా నరసింహా రెడ్డి చిత్రం ఓ స్వాతంత్ర సమరయోధుడు చిత్రంని చెప్పడం, అలాగే సైరా చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలని తెలంగాణా గవర్నర్ని కోరడం జరిగింది.తమిలిసై కూడా సైరా చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూసి సినిమా చాలా బాగావచ్చింది, అందరు తప్పక చుడాలిసిన సినిమాని చెప్పారు.సినిమా ప్రముఖుల సమాచారం ప్రకారం రేపు చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ సియం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నాడని, అందుకోసం జగన్ సియంవో కార్యాలయానికి చరణ్ అప్పాయింట్మెంట్ కోరడం జరిగిందని సమాచారం.
రేపు ఉదయం 11 గంటలకు అప్పాయింట్మెంట్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం.చిరంజీవి రెపు జగన్ ను కలిసి తన సినిమా సైరా నరసింహా రెడ్డి చిత్రం చుడవలిసిందిగా, జగన్ ను, చిరంజీవి కోరనున్నాడు.
చిరంజీవితో పాటుగా చిత్రా నిర్మాత చరణ్ కూడా జగన్ ను కలుస్తాడు.