ఖైదీ నెంబర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నారు.ఏమాత్రం గ్యాప్ లేకుండా వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అభిమానుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.ఏకంగా నలుగురు దర్శకులను లైన్ లో పెట్టారు.
ప్రస్తుతం ” కొరటాల శివ ” దర్శకత్వంలో ” ఆచార్య ” సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చివరి దశకు చేరుకుంది మరికొద్ది రోజుల్లో సినిమాని పూర్తి చేసి రిలీజ్ డేట్ ను ప్రకటించినుంది చిత్ర బృందం.ఈ సినిమాలో ” మెగా పవర్ స్టార్” “రామ్ చరణ్” ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
తదుపరి చిత్రం మళయాళ సూపర్ హిట్ ” లూసిఫర్ ” రీమేక్ చేయనున్నారు.ఈ సినిమాకి ‘మోహన్ రాజా’ దర్శకుడు.ఆ తర్వాత చిత్రాలు ‘మెహర్ రమేష్’ తో పాటు ‘బాబీ’ డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నాడు.‘మెగాస్టార్ చిరంజీవి’.
ఆచార్య చివరి దశకు చేరుకొన్న తరుణంలో ‘ లూసిఫర్ ‘ రీమేక్ కూడా మొదలు పెట్టేశారు.ఈ సినిమా కోసం రీసెంట్ గా హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మించారు.త్వరలో మెగాస్టార్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతారు.ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార పేరు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.ఇక ఈ సినిమా టైటిల్ సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.ఈ సినిమా కోసం పలు పేర్లు పరిశీలనలో చిత్రబృందం చివరకు “గాడ్ ఫాదర్” అనే టైటిల్ ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట.
ఫైనల్ గా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోది.తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేశారని తెలుస్తుంది ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగులో ఆగస్టు చివరి వారంలో మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అవుతారట.