మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజును ఆగస్టు 22న జరుపుకోనున్న సంగతి తెలిసిందే.అయితే ప్రతియేటా ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించే మెగా ఫ్యాన్స్, ఈసారి కరోనా కారణంగా కేవలం సోషల్ మీడియాలోనే జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఇక మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు ఆయనకు విషెస్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు.కాగా తాజాగా మెగాస్టార్ పుట్టినరోజుకు విషెస్ను చెబుతూ తమ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
తెలుగు సినీ చరిత్రలోనే తొలి జోంబీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ, ఈ సినిమాకు ‘జోంబీ రెడ్డి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశాడు.ఈ సినిమాతో టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సృష్టించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.
కాగా తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ను చిరు బర్త్డే కానుకగా రిలీజ్ చేశాడు.ఇందులో జోంబీలు ఎదురుగా వస్తుంటే, వాటిని ఢీకొట్టే హీరో చేతిలో గధ పట్టుకుని ఉన్నాడు.
అతడి వెనకాల చిరు బొమ్మ ఉండటంతో ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
ఇక ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.
కాగా పూర్తి థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ఉండనుందని, ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపాడు.మరి ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.