మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రంగా ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పనులు కూడా మొదలుపెట్టిన ఈ సినిమా ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ను వాయిదా వేసుకుంది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి తన సమయాన్ని ఓ భారీ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.తన ఆత్మకథను రాసుకునే పనిలో మెగాస్టార్ ఉన్నట్లు తెలుస్తోంది.
తన భార్య సురేఖతో కలిసి ఆత్మకథను రాసే ఏర్పాట్లు చేస్తున్నాడట మెగాస్టార్.తన జీవితంలోని పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటున్నాడు.
త్వరలోనే తన ఆత్మకథను రాయడం మొదలుపెడతానని చిరు తాజాగా తెలిపాడు.మొత్తానికి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను చిరంజీవి వెండితెరపై తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.