మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య, ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు పోటీగా చిరు నిలుస్తున్నారు.ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్ను మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్తో కలిసి చేసేందుకు చిరు పచ్చ జెండా ఊపేశాడు.
ఇక తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘వేదాళం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు ఎప్పటినుండో ఆసక్తిగా ఉన్నాడు.దీంతో ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతలను మెహర్ రమేష్కు అప్పగించి చిరు అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.
ఫేడవుట్ అయిన డైరెక్టర్కు చిరు ఎందుకు అవకాశం ఇచ్చాడా అని అందరూ జుట్టుపీక్కుంటున్నారు.ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండనుండటంతో ఈ సినిమాలో విలన్ పాత్ర చేసేందుకు చాలా స్పెషల్ నటుడు కావాలని చిరు అండర్లైన్ చేసి మరీ మెహర్ రమేష్కు చెప్పాడట.
దీంతో ఓ స్పెషల్ విలన్ కోసం చిత్ర యూనిట్ వేట మొదలుపెట్టింది.
బాలీవుడ్లో చిరుతో సమానంగా క్రేజ్ ఉన్న స్టార్ హీరోను విలన్ పాత్రలో నటింపజేసేందుకు మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నాడు.
అయితే చిరు సినిమాలో విలన్గా నటించేందుకు సదరు హీరో ఒప్పుకుంటాడా లేడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోంది.
ఇటీవల ఆమె తనకు చిరు లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినందకు సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మొత్తానికి ఈ సినిమాలో చిరు కోరిక మేరకు స్పెషల్ విలన్ను తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ నానా తంటాలు పడుతున్నారు.