అన్నపూర్ణ స్టూడియోలో నిన్న అంగరంగ వైభవంగా ఏఎన్నార్ అవార్డు వేడుక జరిగింది.ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
ఆయన చేతుల మీదుగా అవార్డు విన్నర్స్కు అవార్డులు ఇవ్వడం జరిగింది.సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్లో చెరగని ముద్ర వేసిన నిన్నటి తరం హీరోయిన్స్ శ్రీదేవి మరియు రేఖలు ఈ అవార్డును దక్కించుకున్నారు.
శ్రీదేవి లేకపోవడం వల్ల ఆమె భర్త బోణీ కపూర్ అవార్డును అందుకున్నారు.?
ఈ అవార్డు వేడుకకు నాగార్జున సరదాగా హోస్టింగ్ చేశాడు.మొదట నాగార్జున మాట్లాడుతూ నాన్నగారి పేరు మీద ఇస్తున్న ఈ అవార్డుతో సినిమా పరిశ్రమ రుణం కొంతైనా తీర్చుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.రేఖ మరియు శ్రీదేవి గార్లకు ఈ అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము.
తప్పకుండా వీరిద్దరు కూడా ఈ అవార్డుకు పూర్తి అర్హులు అని తాను భావిస్తున్నట్లుగా నాగార్జున అన్నాడు.అదే సమయంలో శ్రీదేవి గారితో సినిమాలు చేశాను, కాని రేఖ గారితో సినిమా అవకాశం వస్తే బాగుండు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
రేఖ స్పందిస్తూ మీకు బామ్మగా నటించేందుకు నేను సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.ఆమె మాటల మద్యలో చిరంజీవి కల్పించుకుని నాగార్జునకు రేఖ భార్యగా నటిస్తే చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు.నాకు చాలా కాలంగా ఈ కోరిక ఉంది.నాగార్జున తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంతో ఒక సినిమా చేయాలి.ఆ సినిమాలో తండ్రి నాగార్జున పాత్రకు రేఖ గారు జంటగా నటించాలని తాను ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.ఆమె కూడా అందుకు నవ్వుతూ ఓకే అంది.
మరి చిరంజీవి కోరిక తీరేదేనా?