మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇప్పటికే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇక ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది.
ఆచార్య సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలు ప్రకటించాడు.
ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతుంది.
ఇక త్వరలోనే భోళా శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తున్నాడు.ఈ రెండు సినిమాల షూటింగ్ మాత్రమే కాదు మరొక సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు చిరు.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా తెరకెక్కబోతుంది.
ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.ఇలా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటూనే మరొక సినిమాను కూడా లైన్లో పెట్టాడు.తాజాగా ఛలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
కేవలం రెండు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన కూడా ఆయన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడమే కాకుండా ఆయనకు మంచి పేరు కూడా తెచ్చాయి.ఇక ఇప్పుడు రెండు సినిమాలు ఇచ్చిన గుర్తింపుతో ఏకంగా మెగాస్టార్ చిరు నే డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.ఇక ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య నిర్మించ బోతున్నాడు.ఆయనే మెగాస్టార్ వద్దకు తీసుకు వెళ్లి ప్రాజెక్ట్ ఓకే చేయించాడని టాక్.మెగాస్టార్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్స్ పూర్తి అవ్వగానే ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.మరి వరుసగా రెండు హిట్స్ అందుకున్న వెంకీ ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.