రెండు తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తన రక్తదాన శిబిరం వద్ద తల్లి అంజనాదేవితో కలిసి జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద నిర్వహించిన కార్యక్రమానికి అక్కడ సిబ్బంది మరి కొంతమంది.
ప్రముఖులు పాల్గొనడం జరిగింది.
నిన్ననే తన ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి చిరంజీవి సోషల్ మీడియాలో ఫోటో పెట్టడం జరిగింది.ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు తమ ఇంటిపై జాతీయ జండా ఎగరేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి దాదాపు మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నారు.
ఇందులో “గాడ్ ఫాదర్” షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది.దసరాకి విడుదల కానుంది.
ఇక ఆ తర్వాత “బోలా శంకర్”, 154వ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసే తరహాలో చిత్రీకరణ జరుగుతుంది.