మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ట్విట్టర్లో జాయిన్ అయిన విషయం తెల్సిందే.ఆయన ట్విట్టర్లో జాయిన్ అయిన తర్వాత రెండు మూడు నెలల పాటు రెగ్యుల్గా పోస్ట్లు చేస్తూనే ఉండేవారు.
ఆయన ఫొటోలు వీడియోలు.వ్యక్తిగత విషయాలు సినిమాల విషయాలు ఇతర విషయాలు… సన్నిహితుల పుట్టిన రోజులకు శుభాకాంక్షలు ఇలా ఎన్నో రకాలుగా చిరంజీవి యాక్టివ్గా ఉండేవారు.
ఇప్పుడు ఆచార్య షూటింగ్ తో పాటు ఇతరత్ర కారణాల వల్ల కాస్త జోరు తగ్గింది.సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్లు పడుతూనే ఉన్నాయి.
చిరంజీవి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఒకే ఒక్కరిని ఫాలో అయ్యాడు.ఆయనే రామ్ చరణ్.
తనయుడు రామ్ చరణ్ ను మాత్రమే ట్విట్టర్లో ఫాలో అవుతూ వచ్చిన చిరంజీవి ఇప్పుడు ఆ ఒక్క చరణ్ ను కూడా అన్ ఫాలో అయ్యాడు.
చరణ్ ను కూడా ఎందుకు చిరంజీవి అన్ ఫాలో అయ్యాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.చిరంజీవి ఫాలోవర్స్ జాబితా నుండి ఉన్న ఒక్కగానొక చరణ్ కూడా కనిపించక పోవడంతో అభిమానులు అవాక్కవుతున్నారు.మొదట చిరంజీవి ఫాలోవర్స్ జాబితాలో చరణ్ పేరు పోయి అనీల్ రావిపూడి వచ్చింది.
అనీల్ రావిపూడిని చిరంజీవి ఫాలో అవుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.కొద్ది సమయం తర్వాత ఆ జాబితా నుండి అనీల్ పేరు కూడా పోయింది.
ఉన్నట్లుండి చిరంజీవి ఫాలోవర్స్ జాబితాను ఎమ్టీ ఎందుకు చేశారు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.చాలా మంది ప్రముఖుల ఫాలోవర్స్ జాబిత జీరో ఉంటుంది.
ఇప్పుడు చిరంజీవి ఫాలోవర్స్ జాబిత కూడా జీరో ఉంది.ఒక్కరు ఇద్దరు ఉన్నా కూడా బాగోదనే ఉద్దేశ్యంతో చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ నుండి చరణ్ ను అన్ ఫాలో చేసి ఉంటాడు అంటున్నారు.
ప్రస్తుతం చిరు ఆచార్యలో నటిస్తున్నాడు.వచ్చే నెలలో చరణ్ కూడా ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవుతాడు అంటూ సమాచారం అందుతోంది.