టాలీవుడ్ స్టార్ హీరోలకు ఈగో ఎక్కువగా ఉంటుందని కొందరి అభిప్రాయం.హీరోయిన్స్ లేదా దర్శకులు తమను కాదంటే వారిపై కక్ష సాధిస్తారనే అపోహ కూడా ఉంది.
అయితే కొందరు మాత్రమే అలా ఉంటారని, అందరు కాదని కూడా వాదన ఉందనుకోండి.మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన తనను కాదని వెళ్లి పోయిన హీరోయిన్ విషయంలో కూడా సాఫ్ట్ కార్నర్ను చూపించాడు.
తన సినిమా నుండి అర్థాంతరంగా వెళ్లి పోయిన హీరోయిన్పై ఏ హీరోకు అయినా ఎంతో కొంత కోపం అయితే ఉంటుంది.కాని ఆచార్య నుండి వెళ్లి పోయినందుకు త్రిషపై చిరంజీవికి పెద్దగా కోపం ఉన్నట్లే లేదు.
ఆయన చాలా నార్మల్లగా త్రిష విషయంలో ఉన్నాడు.ఇటీవలే ఆమె ఇతర సినిమాలో పెద్ద ఆఫర్ రావడంతో ఆచార్యను వదిలేసింది.
దాంట్లో ఆమె తప్పు ఏమీ లేదు.ఇక్కడ ఎవరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడాడు.
చిరంజీవి గొడవ పెద్దది కాకుండా చేసేందుకు ఆమె గురించి అలా మాట్లాడి ఉంటాడని అంతా అనుకున్నారు.అయితే తాజాగా ఆమె బర్త్డే సందర్బంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం కూడా జరిగింది.ఈ సంవత్సరం నీకు అంతా బాగుండాలి, మంచి విజయాలు సాధించాలంటూ ఆశిస్తు ట్వీట్ చేశాడు.తన సినిమా నుండి వెళ్లి పోయిన హీరోయిన్ విషయంలో అంత పాజిటివ్గా ఉండటం అనేది కేవలం చిరంజీవికి మాత్రమే చెల్లిందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.