మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఎప్పుడెప్పుడు రిలిజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవడంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం చిరంజీవి మరోసారి తనకు బాగా కలిసొచ్చిన పాటను వాడుకోనున్నట్లు తెలుస్తోంది.
మహాకవి శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ అనే పాటను చిరంజీవి రుద్రవీణ, ఠాగూర్ చిత్రాల్లో వాడుకున్నాడు.ఆ రెండు చిత్రాలు కూడా జాతీయ అవార్డులను దక్కించుకున్నాయి.
దీంతో ఇప్పుడు మరోసారి ఇదే పాటను ఆచార్య చిత్రంలో వాడేందుకు చిరు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కథలో ఓ సన్నివేశంలో ఈ పాట రానున్నట్లు తెలుస్తోంది.
ఆచార్య, సిద్ధ పాత్రలు కలిసి చేసే పోరాటాన్ని ప్రేక్షకులకు తెలిపే విధంగా ఈ పాటను సినిమాలో వినియోగించనున్నారట.ఈ మేరకు కొరటాల శివ ఓ పవర్ఫుల్ సీన్ను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్ల పాత్రలో కనిపించనున్నారు.
దీంతో వారిద్దరు ఈ సినిమాలో కనిపించే సీక్వెన్స్ను కూడా ఓ రేంజ్లో చూపెట్టేందుకు కొరటాల రెడీ అయ్యారు.
ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర సినిమాకే హైలైట్గా నిలవనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాలో శ్రీశ్రీ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.