కొరటాల బాధ చూడలేక చిరు ఆ పని చేస్తున్నాడట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 Chiranjeevi To Resume Acharya Shooting For Koratala Siva, Chiranjeevi, Acharya,-TeluguStop.com

దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా ఆలస్యం కానుందని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని చిత్ర దర్శకుడు కొరటాల అనుకున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వరుసగా వాయిదా పడుతుండటంతో కొరటాల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడట.ఇది గమనించిన మెగాస్టార్ చిరంజీవి, కొరటాలను ఇబ్బంది పెట్టకుండా ఉంచాలని చూస్తున్నాడు.

దీంతో చిరు ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే చిరు త్వరలో ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు చిత్ర యూనిట్‌తో చర్చలు కూడా జరిపాడట మెగాస్టార్.కొరటాల ప్లానింగ్ ప్రకారమే ఈ సినిమా షూటింగ్ జరగాలని ఆయన చిత్ర యూనిట్‌ను కోరినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండగా, ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో చిరు ఓ సోషల్ మెసేజ్‌ను ప్రేక్షకులు అందించేందుకు రెడీ అయ్యాడు.

మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube