మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా ఆలస్యం కానుందని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని చిత్ర దర్శకుడు కొరటాల అనుకున్నాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వరుసగా వాయిదా పడుతుండటంతో కొరటాల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడట.ఇది గమనించిన మెగాస్టార్ చిరంజీవి, కొరటాలను ఇబ్బంది పెట్టకుండా ఉంచాలని చూస్తున్నాడు.
దీంతో చిరు ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే చిరు త్వరలో ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు చిత్ర యూనిట్తో చర్చలు కూడా జరిపాడట మెగాస్టార్.కొరటాల ప్లానింగ్ ప్రకారమే ఈ సినిమా షూటింగ్ జరగాలని ఆయన చిత్ర యూనిట్ను కోరినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండగా, ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో చిరు ఓ సోషల్ మెసేజ్ను ప్రేక్షకులు అందించేందుకు రెడీ అయ్యాడు.
మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.