ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాని దేవా కట్టా తెరకెక్కించాడు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది.ఈ సినిమాపై ముందు అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్, పాటలు అన్ని ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి.
సాయి ధరమ్ తేజ్ యాక్సిండెంట్ లో గాయపడిన కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని వార్తలు అవచ్చాయి.
అయితే ఈ విషయంపై మెగాస్టార్ ఒక క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల చేయాలనీ సాయి తేజ్ అనుకుంటున్నాడట.అందుకే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయడం లేదని అనుకున్న సమయానికే విడుదల చేస్తున్నారని చిరు స్పేటం చేసారు.
ఇక ఈ సినిమా విడుదలకు వరం రోజులు మాత్రమే ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్.ఇక ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను చిరంజీవి చేతుల మీదగా విడుదల చేసారు.ఈ చిత్ర ట్రైలర్ ను చిరు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసారు.
ఈ మేరకు.ఆయన ఈ సినిమా వాయిదా పాడడం లేదని తెలిపారు.
అంతేకాదు సాయి తేజ్ పూర్తిగా కోలుకుంటున్నాడని మీ ఆశీస్సులు, ఆదరణే శ్రీరామ రక్ష అని చిరు ట్వీట్ చేసారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.ఈ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ గా ఉంది.ఇందులో సాయి తేజ్, రమ్య కృష్ణ మధ్య యుద్ధంలాగా కనిపిస్తుంది.
సాయి తేజ్ ఐఏఎస్ అధికారిగా నటింస్తున్నాడు.ఈ ట్రైలర్ ఆధ్యంతం సాయి తేజ్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టాడు.
ఈ డైలాగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.మొత్తానికి సాయి తేజ్ కెరీర్ లో ఈ సినిమా మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పలువు అభిప్రాయ పడుతున్నారు.