బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ప్రతిభ, స్వయంకృషితో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకోగా నాగబాబు సైతం సినిమాల ద్వారా నటుడిగా సత్తా చాటారు.
అయితే చిరంజీవి ఒక సందర్భంలో మాట్లాడుతూ ముగ్గురు అన్నాదమ్ములలో తండ్రి కోపానికి తానే ఎక్కువగా బలయ్యేవాడినని చెప్పుకొచ్చారు.
నాన్నకు ఎప్పుడైనా కోపం వస్తే నాగబాబు పారిపోయేవాడని కళ్యాణ్ చిన్నవాడు కాబట్టి తప్పించుకునేవాడని నాగబాబు చెప్పుకొచ్చారు.
గోగు పుల్లలను తీసుకొని తాను, నాగబాబు కత్తియుద్ధం చేసేవాళ్లమని ఆ పుల్లలు కంట్లో పొడుచుకుంటాయని భావించే ఆ పుల్లలతోనే నాన్న నన్ను వాయించేవారని చిరంజీవి తెలిపారు.తాను ఇంటర్ చదువుతున్న సమయంలో ఫ్యాన్ కు రిపేర్ వస్తే నాన్న చేయించుకురావాలని చెప్పడంతో ఫ్యాన్ ను మెకానిక్ కు ఇచ్చానని ఫ్యాన్ ను సాయంత్రం తీసుకుందామని షాప్ కు వెళితే షాప్ మూసేసి ఉందని చిరంజీవి చెప్పారు.
ఫ్యాన్ ఉంటే మాత్రమే నాన్నకు నిద్ర పడుతుందని తాను ఫ్యాన్ ను రిపేర్ చేయించలేదనే విషయం తెలిసి నాన్న కోపంతో బాగా కొట్టారని చిరంజీవి అన్నారు.ఆ తరువాత ఫ్యాన్ తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ తనను ఇంటి నుంచి బయటకు పంపారని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఆ తరువాత తాను ఫ్రెండ్ ఇంట్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ ను ఇంటికి తీసుకెళితే నాన్న తనకు చదువు దండగ అని రికార్డులను చించేశారని చిరంజీవి చెప్పుకొచ్చారు.
బాటనీ రికార్డులను నాన్న చించివేయడంతో ఆ రాత్రి అంతా తాను ఏడుస్తూనే ఉన్నానని చిరంజీవి తెలిపారు.
తరువాత రోజు నాన్న నన్ను సముదాయించి టెర్లిన్, టెరికాట్ షర్ట్ లు, ప్యాంట్ లు కొనిపెట్టారని తన బోటనీ రికార్డులలో బొమ్మలు వేసి ఇచ్చారని చిరంజీవి తెలిపారు.