మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి.మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా అతని కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ మొత్తానికి ముగింపుకి చేరుకుంది.
భారీ తారాగణంతో, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో ఈ సినిమాని తెరకేక్కిస్తూ ఉన్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్, కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో సుదీప్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇక ఇందులో మెగాస్టార్ కి జోడీగా నయనతార హీరోయిన్ గా చేస్తుంది.
ఇదిలాఉంటే రెండేళ్ళ నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తానికి కంప్లీట్ అయ్యిందని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా తన ట్విట్టర్ లో ప్రకటించాడు.
ఎన్నో అవాంతరాలు, దాటుకొని, నిర్విరామంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసామని తన ట్విట్టర్ ద్వారా రత్నవేలు క్లారిటీ ఇచ్చాడు.ఇక ఈ సినిమా సాంగ్స్ చిత్రీకరణ కూడా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాని తీసుకురావడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నాడు.ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది.
మరి ఇన్ని అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుంది అనేది వేచి చూడాలి.