టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకొని మెగాస్టార్ గా నిలిచాడు.
ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలతో తెలుగు హీరోలకు పోటిగా దూసుకుపోతున్నాడు.ఇక ఈయన కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980లో పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఈ పెళ్లితో కొనిదెల కుటుంబానికి, అల్లు కుటుంబానికి మంచి సంబంధం ఏర్పడింది.పెళ్లి తర్వాత కూడా చిరంజీవి తన భార్య సపోర్ట్ తో సినీ ఇండస్ట్రీలో నిలువగలిగాడు.
ఇక వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉండగా తన కుమారుడు రామ్ చరణ్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా మార్చాడు చిరంజీవి.ఇదిలా ఉంటే చిరంజీవి సురేఖ ఫస్ట్ నైట్ ట్రైన్ లో ప్లాన్ చేశారట.
ఇంతకీ ఆ ప్లాన్ చేసింది ఎవరో కాదు.డైరెక్టర్ రాఘవేంద్ర రావు.
రాఘవేంద్ర రావు చిరంజీవితో ఎన్నో సినిమాలు చేయించాడు.చాలా వరకు అన్ని సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి.ఇక చిరంజీవి రాఘవేంద్ర రావు ని బాబాయ్ అని పిలుస్తుంటాడు.వాళ్ళ ఇంట్లలో ఏమి జరిగినా రాఘవేంద్ర రావు, చిరంజీవి ఒకరికి ఒకరు తమ వేడుకలలో పాల్గొంటారు.
ఇదిలా ఉంటే ఓసారి రాఘవేంద్రరావు చిరంజీవికి సడన్ సర్పైజ్ చేశాడట.
తన పెళ్లయిన కొత్తలో రాఘవేంద్ర రావు తనకు సర్ప్రైజ్ చేశారని చిరంజీవి తెలిపాడు.పెళ్లి సందడి ఫ్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లి అక్కడ కొన్ని విషయాలు పంచుకున్నాడు.అంతేకాకుండా రాఘవేంద్ర రావు తనకు పెళ్లి అయిన కొత్తలో ఇచ్చిన షాకింగ్ సర్ ప్రైస్ గురించి తెలిపాడు చిరంజీవి.
తను పెళ్లయిన కొత్తలో సురేఖ తో పాటు మేటుపాలెం నుంచి చెన్నై వచ్చే ట్రైన్ ఎక్కారట.ఆ ట్రైన్ లో తమ కోసం రాఘవేంద్ర రావు ఒక కుపేనిని బుక్ చేశాడట.
ఇక అందులోకి వెళ్ళి చూడగానే అందమైన శోభనం గదిగా తయారు చేశారట.అక్కడ పళ్ళు, పూలు ఉంచారని ఆ ఏర్పాట్లు చూసి షాక్ అయ్యామని అన్నాడు చిరంజీవి.
ఇలాంటి స్వీట్ మెమోరీస్ తనకు రాఘవేంద్రరావు ఎన్నో ఇచ్చాడని తెలిపాడు.
ఇక తన కెరీర్ మొదలైన కొత్తలో రాఘవేంద్ర రావు మోసగాడు సినిమాలో చిన్న పాత్ర ఇచ్చాడని.ఆ తర్వాత తన దర్శకత్వంలో పూర్తిస్థాయి హీరోగా నటించాలని అనుకున్నాక అడవి దొంగ తో ఆ కోరిక తీరిందని తెలిపాడు.ఇక రాఘవేంద్రరావు తో తనకున్న అనుబంధం గురించి మరి కొన్ని విషయాలు పంచుకున్నాడు చిరంజీవి.
ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేయనున్నాడు.ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ అనే సినిమాను ఫిక్స్ చేశాడు.
బాబి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చిరు.