టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి నటించడంతో అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు పూర్తి కావడంతో ఇటీవల ఈ చిత్ర నిర్మాత అశ్వినీ దత్, ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం ఒక హిస్టారికల్ మూవీ అని, అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయని ఆయన అన్నారు.ఈ సినిమా అప్పట్లోనే థియేట్రికల్ షేర్ పరంగా రూ.7 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.ఆ సమయంలో బాల్కనీ టికెట్ ధర రూ.6 మాత్రమే ఉండటం గమనార్హం.ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి యాక్టింగ్ పరంగా తమలోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ఆయన అన్నారు.ఇక ఈ సినిమాలో నటించినందుకు చిరంజీవికి రూ.35 లక్షలు, శ్రీదేవికి రూ.25 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు అశ్వినీ దత్ అన్నారు.ఆ సమయంలో శ్రీదేవి క్రేజ్ ఓ రేంజ్లో ఉండటంతో ఆమెకు అంత భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిపారు.
ఇక ఈ సినిమాతో అన్నీ ఖర్చులు పోగా రూ.35 లక్షల లాభం పొందినట్లు అశ్వినీ దత్ తెలిపారు.రాఘవేంద్రరావు టేకింగ్, చిరు-శ్రీదేవిల యాక్టింగ్, కీరవాణి సంగీతం కలగలిసి ఈ సినిమాను ఓ మైలురాయిలా నిలిపాయని అశ్వినీ దత్ అన్నారు.ఎప్పటికైనా ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని ఆయన మరోసారి అన్నారు.
మరి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు, ఎవరితో తెరకెక్కిస్తారో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.కాగా ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రాబోయే సినిమాను అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.