మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా తరువాత చిరు తన నెక్ట్స్ చిత్రాలను క్యూలో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే సుజీత్, బాబీ, మెహర్ రమేష్ వంటి డైరెక్టర్ల కథలను వింటున్న చిరు, ఎప్పటినుండో ఓ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు.
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించే చిత్రాలకు సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.శంకర్ రోబో 2.0 చిత్రంతో పాన్ ఇండియా మూవీగా అదిరిపోయే సక్సెస్ను అందుకున్నాడు.కాగా ఈ డైరెక్టర్ గతంలో తెరకెక్కించిన జెంటిల్మెన్ చిత్రం ఎలాంటి రిజల్ట్ను సాధించిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాను బాలీవుడ్లో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు.అయితే బాలీవుడ్లో చిరు నటించిన సినిమాను మహేష్ భట్ డైరెక్ట్ చేశాడు.
అక్కడ ఆ సినిమాకు మంచి స్పందన లభించింది.అప్పుడే శంకర్తో ఓ సినిమాను తెరకెక్కించాలని చిరు అనుకున్నాడు.
కానీ అది ఎందుకో సాధ్య పడలేదు.దీంతో ఇప్పుడు మరోసారి శంకర్ డైరెక్షన్లో చిరు నటించాలని కోరుకుంటున్నాడట.శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తే, అది ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని, ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని చిరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.
మరి ఈ కాంబో గనుక సెట్ అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.