కన్నడ సినీ నటుడు చిరంజీవి సర్జా గత ఏడాది జూన్ 7న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.ఇక అప్పటి నుంచి వాళ్ల ఇంట్లో తీరని విషాదం చోటు చేసుకుంది.2009లో వాయుపుత్ర సినిమా తో తొలిసారిగా వెండితెరకు పరిచయమైన చిరంజీవి.వరుస ఆఫర్లతో కన్నడ స్టార్ గా నిలిచాడు.
ఇక ఈయనకు 2018 అక్టోబర్ లో సినీ నటి మేఘన రాజ్ తో పెళ్లి జరిగింది.
ఇక ఆయన మరణించే ముందు మొత్తం నాలుగు సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకున్నారు.
నటిస్తున్న చిరంజీవి అనుకోకుండా గుండెపోటుతో మరణించారు.ఆయన మరణించిన సమయంలో తన భార్య మేఘన ఐదు నెలల గర్భవతిగా ఉండగా గత ఏడాది అక్టోబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అంతే కాకుండా ఆయనకు జూనియర్ చిరంజీవి అని పేరు కూడా పెట్టగా.తన కొడుకును అభిమానులకు పరిచయం చేసింది మేఘన.
ఇక తన భర్త చనిపోయిన తర్వాత మేఘన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.ఆమె ఇంటికే పరిమితం కాగా ఇంటి నుండి బయటకు రాకుండా ఒంటరిగానే జీవించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ నిర్ణయం తీసుకుంది.ఇక ఇంటిపట్టునే ఉంటే మానసికంగా ఆరోగ్యం పాడవుతుందనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది.
తన జీవితంలో జరిగిన ఆ సంఘటన మర్చిపోవడానికి తీరిక లేకుండా బిజీ గా ఉండాలని నిర్ణయించుకుంది.దీనికి దారి సినిమాల్లో నటించడం ఒకటే మార్గమని అనుకుంది.ఇక ఆమె నటించడానికి ఒప్పుకోవడం తో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది.ఆమె తీసుకున్న నిర్ణయంతో ఆమె కుటుంబం ఎంతో సంతోషపడింది.ఇక ఆమె సెల్ఫీ మమ్మీ గూగుల్ డాడీ, బుద్ధిమంత 2 సినిమాల్లో నటించనుంది.అంతేకాకుండా మరికొన్ని ప్రాజెక్టులో కూడా అవకాశాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.