తెలంగాణపై మనసుపడ్డ హీరో.. రచ్చ చేస్తానంటోన్న డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని, పూర్తి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

 Sampath Nandi Chiranjeevi Movie On Telangana Struggle, Chiranjeevi, Sampath Nand-TeluguStop.com

కాగా ఈ సినిమా తరువాత చిరు వరుసగా యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌తో కలిసి లూసిఫర్ రీమేక్‌ను తెరకెక్కించేందుకు చిరు రెడీ అయ్యాడు.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు మార్పులు చేయాల్సిందిగా సుజీత్‌కు తెలిపాడు చిరు.ఆ తరువాత బాబీ, మెహర్ రమేష్ వంటి డైరెక్టర్స్ చెప్పే కథలను కూడా వినేందుకు చిరు ఆసక్తి చూపుతున్నాడట.

అయితే ఈ క్రమంలోనే మరో యంగ్ డైరెక్టర్ సంపత్ నంది చిరు కోసం ఒ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేస్తున్నాడట.ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కథ అని, రజాకార్ల పోరాటంపై ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తోంది.

లాక్‌డౌన్ ముగియగానే చిరుకు ఈ సినిమా కథను వినిపించాలని సంపత్ నంది ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం టాలీవుడ్ హీరో గోపీచంద్‌తో కలిసి సీటీమార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్.

పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి, చిరు ఓకే అనగానే తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేయడానికి సంపత్ నంది సిద్ధమవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube