మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడని, పూర్తి సోషల్ మెసేజ్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కాగా ఈ సినిమా తరువాత చిరు వరుసగా యంగ్ డైరెక్టర్స్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సాహో చిత్ర దర్శకుడు సుజీత్తో కలిసి లూసిఫర్ రీమేక్ను తెరకెక్కించేందుకు చిరు రెడీ అయ్యాడు.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు మార్పులు చేయాల్సిందిగా సుజీత్కు తెలిపాడు చిరు.ఆ తరువాత బాబీ, మెహర్ రమేష్ వంటి డైరెక్టర్స్ చెప్పే కథలను కూడా వినేందుకు చిరు ఆసక్తి చూపుతున్నాడట.
అయితే ఈ క్రమంలోనే మరో యంగ్ డైరెక్టర్ సంపత్ నంది చిరు కోసం ఒ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేస్తున్నాడట.ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కథ అని, రజాకార్ల పోరాటంపై ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తోంది.
లాక్డౌన్ ముగియగానే చిరుకు ఈ సినిమా కథను వినిపించాలని సంపత్ నంది ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం టాలీవుడ్ హీరో గోపీచంద్తో కలిసి సీటీమార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్.
పూర్తి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి, చిరు ఓకే అనగానే తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేయడానికి సంపత్ నంది సిద్ధమవుతున్నాడు.