మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర దర్శకుడు కొరటాల శివ పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా కొరటాల తెరకెక్కిస్తుండగా, చిరంజీవి ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్లో మనకు కనిపిస్తాడు.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా ఈ సినిమా రీమేక్ రైట్స్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో లూసిఫర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు యంగ్ డైరెక్టర్ సుజీత్ను చిరు, చరణ్లు సెలెక్ట్ చేశారు.
ఇక ఈ మెగా ప్రాజెక్ట్ను రెడీ చేసేందుకు సుజీత్ తనవంతుగా స్క్రిప్టు పనులు కూడా మొదలుపెట్టాడు.అయితే లూసిఫర్ చిత్ర స్క్రిప్టులో సుజీత్ చేసిన మార్పులు-చేర్పులు చిరుకు నచ్చలేదని చిత్రపురిలో వార్తలు వినిపించాయి.
దీనికి తోడు ఈ సినిమా బాధ్యతలను ఇటీవల మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్కు అప్పగించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది.దీంతో లూసిఫర్ చిత్ర రీమేక్ నుండి సుజీత్ను ఎందుకు తప్పించారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
అయితే ఈ రీమేక్ బాధ్యతల నుండి సుజీత్ ఎందుకు తప్పుకున్నాడు అనే అంశంపై చిరు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.ఇటీవల పెళ్లి చేసుకున్న సుజీత్, తనవద్దకు వచ్చి ఈ సినిమాపై ఫోకస్ చేయలేకపోతున్నట్లు, ఈ సినిమా నుండి తాను తప్పుకుంటానని కోరినట్లు చిరంజీవి వెల్లడించారు.
దీంతో సుజీత్ కోరికను తాను ఓకే చేశానని, అందుకే ఈ సినిమా బాధ్యతలను మరో డైరెక్టర్ వివి వినాయక్కు అప్పగించినట్లు చిరు వెల్లడించాడు.ఇక ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చిరు తెలిపారు.
మొత్తానికి పెళ్లి కారణంగా సుజీత్ మెగా ప్రాజెక్ట్ నుండి బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ కొంతమేర ఆశ్చర్యానికి గురవుతున్నారు.