టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటన గురించి అందరికి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకున్నారు.
నాటి నుంచి నేటి వరకు తన నటనలో ఎలాంటి మార్పు లేకుండా దానికి మించి మరింత స్థాయి లో నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.నాటి హీరోయిన్ ల నుండి నేటి యంగ్ హీరోయిన్ ల వరకు నటిస్తున్న హీరోలలో మెగాస్టార్ ఒక్కరే.
కాగా మెగాస్టార్ నటిస్తున్న రీమేక్ సినిమాలలో ఒకే నెలలో విడుదల చేను ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం చిరంజీవి నటించనున్న సినిమా మలయాళం నుంచి మంచి విజయాన్ని సాధించుకున్న లూసిఫర్ సినిమా తెలుగులో మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రీమేక్ చేయనున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా మెగాస్టార్.తన తనయుడు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ గంట సేపు ఉండేలా చేశారు దర్శకుడు కొరటాల శివ.కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ చరణ్ సిద్ధ అనే పాత్ర తో తెరకెక్కనున్నంది.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరోసారి మెగాస్టార్ సరసన నటిస్తుంది.
ఈ సినిమా ప్రొడక్షన్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలయికలో నిర్మిస్తున్నారు.కాగా ఈ ఇద్దరి మెగా స్టార్లతో సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే లూసిఫర్ తోపాటు మరో సినిమా తమిళంలో విజయం సాధించిన “వేదళమ్” ను రీమేక్ చేయగా ఫిబ్రవరిలో సెట్స్ వెళ్లనుందని చిత్ర బృందం తెలిపారు.కాగా లూసిఫర్ సినిమాకు ఈ ఏడాది జనవరి 21న పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కాగా ఈ రెండు రీమేక్ సినిమాలు ఒకేసారి విడుదల కు సిద్ధమవుతుందని అంచనా వెయ్యొచ్చు.