మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం నిర్విరామంగా షూటింగ్ జరుపుకోవాల్సింది.కానీ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో చిరు ఓ సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.కాగా ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటించేందుకు మరో స్టార్ హీరో కూడా రెడీ అవుతున్నాడు.
ఈ కేమియో పాత్రలో నటించేందుకు తొలుత సూపర్ స్టార్ మహేష్ను అనుకున్నా, ఇప్పుడు ఈ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మధ్య నడిచే ఓ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరి మధ్య నడిచే మెగా యాక్షన్ సీన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఇంతకీ వారిద్దరు ఏ సందర్భంలో ఎదురుపడుతారనే అంశం కూడా ప్రేక్షకులను కట్టిపడేయనుందట.
అయితే ఈ సినిమాలో చరణ్ చేయబోయేది ఓ నక్సలైట్ పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరు-చరణ్లు గతంలో కలిసి డ్యాన్స్ చేయగా, ఇప్పుడు కలిసి ఫైట్ చేయనున్నారు.
అయితే వీరిద్దరి మధ్య ఈ ఫైట్ను ఓ రేంజ్లో చూపించేందుకు కొరటాల శివ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
ఈ సినిమాతో చిరు మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు పాతర వేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.