మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ నిన్నటి వరకు గోదావరి జిల్లా మేరేడుమిల్లి అటవి ప్రాంతంలో జరిగిన విషయం తెల్సిందే.దాదాపు గా మూడు వారాల పాటు చిరంజీవి మరియు చరణ్ లు అక్కడ షూటింగ్ లో పాల్గొన్నారు.
చరణ్ పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.చరణ్ మరియు చిరంజీవిల కాంబోలో వచ్చే సీన్స్ అభిమానులతో పాటు అందరికి కూడా రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయంటూ చెబుతున్నారు.
పెద్ద ఎత్తున ఈ సీన్స్ ను కొటాల శివ తెరకెక్కించాడు.దాదాపు గా మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ ను చేశాడు కనుక సినిమా లో ఎక్కువ సమయం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇటీవలే చరణ్ మరియు చిరుల కాంబో షూటింగ్ ను చూసేందుకు గాను ఉపాసన రాజమండ్రి విమానాశ్రయంలో దిగి మేరేడు మిల్లి వెళ్లిన విషయం తెల్సిందే.
ఉపాసన రెండు రోజులు షూటింగ్ ను చూసి అక్కడ వాతావరణంను చరణ్ తో కలిసి ఎంజాయ్ చేసి నేడు ఉదయం తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.
ఆచార్య సినిమా విడుదల తేదీ ఇప్పటికే ఖరారు అయ్యింది.ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల లోనే సినిమా ను ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరో వారం నుండి పది రోజుల పాటు చరణ్ ఆచార్య సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చివరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో మళ్లీ ఒక సెట్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి ఆచార్య లో చిరు మరియు చరణ్ ల కాంబో సీన్స్ పూర్తి అయిన నేపథ్యంలో అభిమానులు సినిమా పై మరింతగా అంచనాలు పెంచుకుంటున్నారు.