మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు మేరేడుమిల్లి అటవి ప్రాంతంలో చేశారు.
అక్కడ నుండి ఖమ్మం ఇల్లందు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు.అక్కడ నుండి చిత్ర యూనిట్ సభ్యులు తిరిగి వచ్చేశారు.
హైదరాబాద్ చేరుకున్న చిత్ర యూనిట్ సభ్యులు తదుపరి షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మరీ ఆలస్యం చేయకుండా ఈసినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ను ఈ నెల మూడవ వారంలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి తో పాటు చరణ్ కూడా మేరేడుమిల్లి మరియు ఖమ్మం షెడ్యూల్ ల్లో పాల్గొన్నాడు.
ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించబోతుంది.పూజా హెగ్డే కేవలం 10 నిమిషాలు స్క్రీన్ స్పేస్ మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది.
ఒక పాటలో కూడా పూజా కనిపించే అవకాశం ఉంది.మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
వంద కోట్లకు మించి వసూళ్లను కేవలం రెండు మూడు రోజుల్లోనే చేసేంత గా క్రేజ్ ఉన్న ఈ సినిమా బాహుబలి మరియు సాహో రికార్డులను బ్రేక్ చేయబోతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.మెగా స్టార్ చిరంజీవి సైరా సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేసిన విషయం తెల్సిందే.
వరుస సక్సెస్ లతో ఉన్న కొరటాల శివ ఈ సినిమా కు దర్శకత్వం వహించడం వల్ల కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.