టాలీవుడ్ స్టార్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత అక్కినేని హీరోయిన్గా ఎలాంటి క్రేజ్ సాధించుకుందో అందరికీ తెలిసిందే.ఈ బ్యూటీ తన సినిమాలతో పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు తన సినిమాలను బ్లాక్బస్టర్లుగా మల్చడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
ఇక ఈ బ్యూటీ ఒక సినిమాలో నటిస్తుందంటే ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని సినీ వర్గాలు ముందే అంచనాలు వేస్తుంటాయి.కాగా సమంత క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల సామ్జామ్ అనే టాక్ షోను ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫాంలో నిర్వహిస్తున్నారు.
ఈ టాక్ షో తొలి ఎపిసోడ్కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను తీసుకొచ్చింది సమంత.అయితే ఆ ఎపిసోడ్కు పెద్దగా ఆదరణ లభించలేదని భావించిన నిర్వాహకులు, రెండో ఎపిసోడ్కు మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్గా తీసుకొచ్చారు.
కాగా ఈ షోను ఇటీవల షూట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ షోలో పాల్గొనేందుకు చిరు కోసం అల్లు అరవింద్ బాగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
చిరు గెస్ట్గా వస్తే ఈ షోకు ఆదరణ భారీగా పెరుగుతుందని అరవింద్ ప్లాన్ వేశాడు.తొలుత చిరంజీవిని ఈ షో చివరి ఎపిసోడ్కు గెస్ట్గా పిలవాలని ఆయన భావించారు.
కానీ సామ్జామ్కు మంచి క్రేజ్ తీసుకురావాలని చిరును ముందుగానే ఈ షోకు తీసుకొచ్చారు.ఇక ఆయన పాల్గొన్న షోను సమంత రెట్టింపు ఉత్సాహంతో హోస్ట్ చేసిందని, ఈ ఎపిసోడ్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని నిర్వాహకులు అనుకుంటున్నారు.
మరి చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్కు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.ఇక సినిమాల పరంగా ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.