మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్యకు సంబంధించిన అప్డేట్ కోసం మెగాఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచిచూస్తున్నారు.ఓ సినిమా వేడుకలో ఈ సినిమా టైటిల్ లీక్ చేసిన చిరు, ఆ తరువాత ఎలాంటి అప్డేట్ను చెప్పలేదు.
కాగా ఇటీవల సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరు, చాలా యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నాడు.
తాజాగా ఆచార్య సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చిరు తాజాగా వెల్లడించాడు.
ఆచార్య సినిమాలో చిరు సరసన హీరోయిన్గా తొలుత త్రిషను అనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది.దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ను తీసుకున్నారు.
అయితే ఈ సినిమా నుండి త్రిష ఎందుకు వెళ్లిపోయిందనే విషయంపై చిరు క్లారిటీ ఇచ్చాడు.త్రిష తమిళ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో ఓ సినిమా ఒప్పుకుందట.
అందుకే ఈ సినిమా నుండి తప్పుకుందని చిరు అన్నాడు.
చిరు రెండు విభిన్న పాత్రల్లో నటించనున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డితో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.