మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకోవాల్సింది.కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
కాగా ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడట.అయితే ఈ సినిమాలో తొలుత చిరు సరసన అందాల భామ త్రిషను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ఆమె ఈ సినిమా నుండి హఠాత్తుగా వాకౌట్ చేయడంతో ఈ సినిమాలో అందాల చందమామ కాజల్ను హీరోయిన్గా ఫిక్స్ చేశారు.
అయితే ఈ సినిమా నుండి వాకౌట్ చేసిన త్రిష ఆ తరువాత చిరుపై ఎలాంటి కామెంట్ చేయలేదు.
కాగా త్రిష పుట్టినరోజున ఆమెను చిరు విష్ చేయడంతో ఆమె తిరిగి థ్యాంక్స్ చెప్పింది.అయితే తాజాగా చిరును అవమానించే విధంగా త్రిష ఆల్టైమ్ ఫేవరెట్ నటుల్లో చిరు పేరును ప్రస్తావించలేదు.
తనకు ఆల్టైమ్ నటుల్లో ఆమీర్ ఖాన్, మోహన్ లాల్, కమల్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.ఈ లెక్కన ఆమె నటించిన చిరు పేరును ఎందుకు చెప్పలేదా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఏదేమైనా టాలీవుడ్లో గతకొంత కాలంగా ఫేడవుట్ అయిన త్రిష చిరుతో కలిసి మంచి అవకాశాన్ని పోగొట్టుకుందని, ఇప్పుడు ఇలా చిరును ఉద్దేశించి అనవసరంగా వివాదంలోకి దిగి తనకు రాబోయే అవకాశాలను సైతం దూరం చేసుకుంటోందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.కాగా త్రిష ప్రస్తుతం టాలీవుడ్లో మాస్ రాజా రవితేజ నటించబోయే ఓ సినిమా కథను వింటున్నట్లు, త్వరలోనే ఆ సినిమాను ఓకే చేయనున్నట్లు తెలుస్తోంది.